భక్తులకు అలర్ట్..మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత..ఎందుకంటే?

మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది

By -  Knakam Karthik
Published on : 30 Jan 2026 7:55 AM IST

Andrapradesh,Tirumala, TTD, Srivari Temple, lunar eclipse

భక్తులకు అలర్ట్..మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత..ఎందుకంటే?

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు కీలక సూచన. మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏదైనా గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే మార్చి 3వ తేదీ తిరుమల ఆలయం తలుపులు ఉదయం 9 గంటలకు మూసివేయనున్నట్టుగా తెలిపింది. ఆరోజు రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్టుగా పేర్కొంది.

అనంతరం శుద్ది, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ఆరోజు రాత్రి 8..30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టుగా తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా... ఆ రోజున అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది.

Next Story