NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి

ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

By Knakam Karthik
Published on : 2 May 2025 2:38 PM IST

NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి

ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేట మండలం ఏ.కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22) యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆన్ లైన్ వేదికగా ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల తన స్వగ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి, అక్కడే ఉరివేసుకుని మరణించినట్లు తెలుస్తోంది.

అయితే, మధుమతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. వివాహితుడైన ప్రతాప్ తో మధుమతికి పరిచయం ఉందని, అది వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది. ప్రతాప్ తమ కుమార్తెను తీసుకెళ్లి ఉరివేసి చంపివేశాడని మధుమతి తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రతాప్‌ను శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధుమతి మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు, ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story