రెండు గంటల పాటు చ‌ర్చ‌లు జ‌రిపిన షర్మిల, సునీతారెడ్డి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల సోమవారం తన సోద‌రి వై.ఎస్. సునీతారెడ్డిని క‌లిశారు.

By Medi Samrat  Published on  29 Jan 2024 10:13 AM GMT
రెండు గంటల పాటు చ‌ర్చ‌లు జ‌రిపిన షర్మిల, సునీతారెడ్డి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల సోమవారం తన సోద‌రి వై.ఎస్. సునీతారెడ్డిని క‌లిశారు. సునీతా రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేఫ‌థ్యంలో వీరి భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా వైఎస్ఆర్ కడపకు వచ్చిన షర్మిల సునీతారెడ్డిని కలిశారు. రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

సునీతారెడ్డి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె. 2019 ఎన్నికలకు కొన్ని వారాల ముందు వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కొంతమంది కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా పేర్కొన్న ఈ కేసులో న్యాయం కోసం ఆమె పోరాటం చేస్తున్నారు.

సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తన తండ్రి హత్య కేసులో ఉన్న బంధువులను రాజకీయంగా నిలదీయాలని సునీత యోచిస్తున్నట్లు సమాచారం.

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌.భాస్కర్‌రెడ్డిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. భాస్కర్ రెడ్డి ఇటీవల బెయిల్‌పై విడుదలైనప్పటికీ సునీత బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వివేకానందరెడ్డిని ఆస్తి కోసం కుటుంబ స‌భ్యులు హత్య చేయలేదని, మొత్తం ఆస్తిని తన కూతురి పేరున ఇప్పటికే రాసి ఉంచార‌ని షర్మిల గతేడాది పేర్కొంది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ సోదరుడు వివేకానందరెడ్డి. రాజశేఖర రెడ్డి ఎన్నికలకు కొన్ని వారాల ముందు మార్చి 15, 2019న పులివెందులలోని తన ఇంట్లో హత్యకు గురయ్యారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని బరిలోకి దింపడం వివేకానందరెడ్డికి ఇష్టం లేకపోవడంతో హత్యకు కుట్ర పన్నినట్లు సీబీఐ పేర్కొంది. పార్టీ అభ్యర్థిగా జగన్ తన సోదరి షర్మిల లేదా తల్లి వైఎస్ విజయమ్మని పోటీకి దింపాలని వివేకానంద రెడ్డి కోరినట్లు సమాచారం.

మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు సోమవారం వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరుకాగా, విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

Next Story