సుప్రీంకోర్టులో మాజీ సీఎంకు రిలీఫ్.. పిటిషన్లు వెనక్కి తీసుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్

ఏపీ మాజీ సీఎం జగన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ దక్కింది.

By Knakam Karthik
Published on : 27 Jan 2025 12:04 PM IST

Andrapradesh, Tdp, Ysrcp,Supreme COurt, Jagan, RaghuRamaKrishnaRaju

సుప్రీంకోర్టులో మాజీ సీఎంకు రిలీఫ్.. పిటిషన్లు వెనక్కి తీసుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్

ఏపీ మాజీ సీఎం జగన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ దక్కింది. వివిధ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ రద్దు చేయాలని, ఆ కేసుల విచారణ మరో కోర్టుకు బదిలీ చేయాలని నాటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జగన్‌పై ఉన్న కేసులపై ప్రత్యేక విచారణ అవసరంలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో రఘురామకృష్ణంరాజు కోర్టులో వేసిన తన పిటిషన్లను వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. దీంతో మాజీ సీఎం జగన్‌కు ఈ విషయంలో స్వల్ప ఊరట లభించినట్లయింది.

అయితే మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ సరిగా జరుగుతుండటం లేదని, విచారణ పూర్తవడం కూడా లేదని రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని అందులో తెలిపారు. గత 12 సంవత్సరాలుగా మాజీ సీఎం జగన్ బెయిల్‌పై ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయకుంటే ఈ కేసుల విచారణలో తీవ్ర ఆలస్యం జరిగే అవకాశం ఉందని మరో పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా వీటిని సోమవారం రోజు కోర్టు నిర్ణయంతో రఘురామకృష్ణంరాజు వెనక్కి తీసుకున్నారు.

Next Story