సీఎం జగన్‌ సర్కార్‌.. రెడ్డిలకే కీలక పదవులు ఇచ్చింది: అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన సామాజికవర్గానికి చెందిన వారిని మాత్రమే అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

By అంజి  Published on  29 Nov 2023 2:45 AM GMT
Reddys, Jagan government, TDP, Atchannaidu, APnews

సీఎం జగన్‌ సర్కార్‌.. రెడ్డిలకే కీలక పదవులు ఇచ్చింది: అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సామాజికవర్గానికి చెందిన వారిని మాత్రమే అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఇక్కడ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన సామాజిక న్యాయ నిబద్ధతను గాలికి విస్మరించారని టీడీపీ నేత ఆరోపించారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో కలిసి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటేషన్‌పై వచ్చిన 15 మంది అధికారుల్లో 10 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారేనన్నారు. ఈ సివిల్ సర్వెంట్లందరికీ అత్యధిక ఆదాయం వచ్చే విభాగాల్లో పోస్టులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చిన కేంద్ర సర్వీసు అధికారులకు సాధారణంగా ఉన్నత పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చర్య సర్వీస్ రూల్స్ ఉల్లంఘించడమేనన్నారు. కొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్‌లు తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. సొంత వర్గం అధికారులతో రాష్ట్రాన్ని దోచేస్తూ, ప్రశ్నించిన బడుగుల ప్రాణాలు తీస్తున్నారన్నారు. రాష్ట్రంలో, ఇతర వర్గాల్లో సమర్థులైన అధికారులు లేరా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఒకే వర్గం అధికారులకు పెత్తనం, కీలక పదవుల్లో నియమించడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story