ఆహ్వానిస్తే వైసీపీలోకి వెళ్తా : రాయపాటి రంగారావు

గత 8 సంవత్సరాల నుండి టీడీపీ పార్టీ లో పని చేస్తున్నానని.. టీడీపీ కర్రెప్టెడ్ పార్టీ రాయపాటి రంగా అన్నారు.

By Medi Samrat  Published on  12 Jan 2024 4:12 PM GMT
ఆహ్వానిస్తే వైసీపీలోకి వెళ్తా : రాయపాటి రంగారావు

గత 8 సంవత్సరాల నుండి టీడీపీ పార్టీ లో పని చేస్తున్నానని.. టీడీపీ కర్రెప్టెడ్ పార్టీ రాయపాటి రంగారావు అన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్రంలో సంపద దోచుకున్నారని ఆరోపించారు. నాన్నా రాయపాటి సాంబశివరావును, నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీలో కేవలం అగ్ర కులాలకే ప్రాధాన్యత ఇస్తారని ఆరోపించారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చా అన్నావ్ లెక్కలు చూపించండి అని టీడీపీ నేతలను డిమాండ్ చేశారు.

మంగళగిరిలో పోటీ చెయ్ ఈ రోజు నుండి నిన్ను ఓడించి పనిలో ఉంటాన‌ని అన్నారు. నీకు దమ్ము ఉంటే మంగళగిరి లో పోటీ చెయ్ అని స‌వాల్ విసిరారు. ఎన్నారైల‌ దగ్గర నుండి.. పార్టీ నాయకుల నుండి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. పోలవరం 70 శాతం ఎక్కడ అయ్యిందని ప్ర‌శ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ లో ఎవరెవరు ఎంత తిన్నారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. లోకేష్ పార్టీలో అడుగు పెట్టాక‌ పార్టీ నాశనం అయ్యిందన్నారు.

వైసీపీ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ పాలన నాకు బాగా నచ్చిందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పని చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. లోకేష్ కార్యకర్తల ను రెచ్చగొట్టి రెడ్ బుక్ పెట్టి తిరిగాడని విమ‌ర్శించారు. వైసీపీ నన్ను ఆహ్వానిస్తే వైసీపీ పార్టీలోకి వెళ్తానని తెలిపారు. కేవలం కృష్ణ, గుంటూరు జిల్లాలో కులాలను లోకేష్ రెచ్చగొట్టాడని.. టీడీపీలో బీసీలను ఒక మూలన కూర్చోపెట్టాడని ఫైర్ అయ్యారు. టీడీపీ అంటేనే అయ్యా కొడుకు పార్టీ.. ఇది ఒక బిజినెస్ పార్టీ అని విమ‌ర్శించారు.

Next Story