అరసవల్లి సూర్యదేవాలయంలో ఘ‌నంగా ప్రారంభమైన‌ రథసప్తమి వేడుకలు

Ratha Saptami celebrations begins at Suryadev temple in Arasavalli of Srikakulam. శ్రీకాకుళంలోని అరసవల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సూర్యదేవుని ఆలయంలో మంగళవారం

By Medi Samrat  Published on  8 Feb 2022 4:03 AM GMT
అరసవల్లి సూర్యదేవాలయంలో ఘ‌నంగా ప్రారంభమైన‌ రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళంలోని అరసవల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సూర్యదేవుని ఆలయంలో మంగళవారం ఉదయం రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లథాకర్ తదితరులు పాల్గొన్నారు. సూర్య దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనివార్య కారణాల వల్ల విశాఖ శారదా పీఠం శ్రీ స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోవడంతో ఆలయ అర్చకులు స్వయంగా సేవలను పూర్తి చేశారు.

అభిషేకం అనంతరం ప్రత్యేక అర్చనలు, ద్వాదశ హారతి, మహా నివేదన, పుష్పయాగం నిర్వహిస్తారు. మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు దర్శనం, రాత్రి 11 గంటల నుంచి ఏకాంత సేవ నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆలయంలో ఇప్పటికే 32 సీసీ కెమెరాలు ఉన్నాయి. నిఘా నిమిత్తం డ్రోన్ కెమెరాల‌ను సైతం వినియోగించనున్నారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.500 టిక్కెట్లు విక్రయిస్తామని.. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాదం, దర్శనం టిక్కెట్లను విక్రయిస్తామన్నారు.


Next Story