నారా లోకేష్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని

ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి

By Medi Samrat  Published on  23 Aug 2023 12:00 PM GMT
నారా లోకేష్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని

ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. తన ప్రాణాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి ప్రమాదం ఉందని ఫిర్యాదు చేశారు. మంళగిరిలోని పోలీస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన పోసాని డీజీపీతో సమావేశం అయ్యారు. నారా లోకేష్ నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని, లోకేష్ మాట్లాడిన వీడియోల ఫుటేజ్ ను కూడా డీజీపీకి అందించారు.

తన పరువుకు భంగం కలిగించేలా పోసాని కృష్ణ మురళి వ్యవహరించారంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. దీనిపై పోసాని మాట్లాడుతూ.. లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేసి తెలుగు దేశం లో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. తాను ఒప్పుకోకపోవడంతో చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ అక్రమాలపై విమర్శలు చేసినందుకు తనపై రూ.4 కోట్ల పరువు నష్టం కేసు వేశారని ఆరోపించారు. ఇకపై నుంచి తాను కూడా కేసులు వేస్తానని అన్నారు. లోకేష్ గతంలో ఎవరి మీదా.. విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు, విమర్శలు లేకుండానే యువగళం పాదయాత్ర జరుగుతోందా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్ ఆస్తులు కొనుగోలు చేశారని, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని అన్నారు.

Next Story