దివ్యాంగ విద్యార్దులకు శుభ‌వార్త‌.. నేరుగా ఖాతాల్లో ఫించను జమ

వయోవృద్దుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By Medi Samrat
Published on : 24 March 2025 7:49 PM IST

దివ్యాంగ విద్యార్దులకు శుభ‌వార్త‌.. నేరుగా ఖాతాల్లో ఫించను జమ

వయోవృద్దుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు మంత్రి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2వ సమావేశం మరియు స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజాబులిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వయో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రత పింఛన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ, విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం ధృవపత్రాల జారీ, ప్రధాన మంత్రి దివ్యాస కేంద్రాల (పిఎమ్‌డికెలు) స్థాపన మరియు ఉపకరణాల సరఫరా. వివిధ అభివృద్ధి పథకాలు/కార్యక్రమాలలో 5% రిజర్వేషన్ల అమలు, వసతి గృహాలు, కళాశాలల్లో విద్య నభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు DBT మోడ్‌లో పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్షించారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వయోవృద్దులు,విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇంటికి దూరంగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో వసతి గృహాలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్దుకులకు ఫించన్ నేరుగా వారిఖాతాల్లోనే జమచేస్తాం. నిజమైన లబ్దిదారులకు ఫించన్ అందించడమే లక్ష్యంగా ఫించన్ల వెరిఫికేషన్ జరుగుతోంది. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఫించన్ తొలగించం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పధకాలు అందాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 5 ప్రధానమంత్రి దివ్యాస కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వీటిని విజయవాడ, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంధ విద్యార్దులకు వచ్చే విద్యా సంవత్సరం మొదట్లోనే బ్రెయిలీ లిపి పుస్తకాలు అందిస్తామన్నారు. ఆటిజం విద్యార్దులు తల్లితండ్రులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.

కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్దాశ్రమాలు నిర్మిస్తున్నామని,అన్ని జిల్లాల్లో వృద్దాశ్రమాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వయో వృద్దుల హక్కులపై వారికి అవగాహన కల్పించటంతో పాటు చట్టాల్ని పటిష్టింగా అమలు చేయాలన్నారు. ఒంటరిగా నివాసం ఉంటున్న వయోవృద్దుల వివరాలు పోలీసు శాఖ సేకరించి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. వయోవృద్దులందరికీ డిజిటల్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. వయో వృద్దులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, వృద్దుల ఆరోగ్య సంరక్షతోపాటు ఆస్తుల సంకరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాజంనేయస్వామి తెలిపారు.

Next Story