అమరావతి: రాజధాని అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. బార్ కౌన్సిల్ ట్రస్ట్ దీన్ని ఏర్పాటు చేయనుంది. 'ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్' పేరుతో విద్యాసంస్థ ఏర్పాటు కానుంది. ఈ వర్సిటీకి ప్రభుత్వం 55 ఎకరాలు కేటాయించింది. ఈ విద్యాసంస్థ న్యాయ విద్యతో పాటు పరిశోధనకు ఉపయోగపడేలా నిర్మించనుంది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు.
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీసీఐ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, సభ్యులు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబుతో వేరు వేరుగా సమావేశం అయ్యారు. లా వర్సిటీలో ఆర్బిట్రేషన్ సెంటర్ సైతం ఏర్పాటు కానుంది. న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్కు ఈ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుంది.