విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఇద్దరిపై NIA చార్జ్‌షీట్

విజయనగరం ఉగ్ర‌ కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఇద్దరు నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

By -  Knakam Karthik
Published on : 12 Nov 2025 8:59 AM IST

Andrapradesh, Vizianagaram terror conspiracy case, NIA, Telangana, ISIS, social media radicalization

విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఇద్దరిపై NIA చార్జ్‌షీట్

విజయనగరం ఉగ్ర‌ కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఇద్దరు నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగ్ర చర్యలకు సంబంధించిన కుట్ర కేసులో సిరాజ్ ఉర్ రెహమాన్ (విజయనగరం – ఆంధ్రప్రదేశ్), సయ్యద్ సమీర్ (హైదరాబాద్ – తెలంగాణ)లను వరుసగా మే 16 మరియు 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో, సోషల్ మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువతను రాడికలైజ్ చేసి, ఉగ్ర దాడులకు ప్రేరేపించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఈ ఉగ్ర కార్యకలాపాలకు ప్రేరేపించేందుకు ఇద్దరూ వివిధ సోషల్ మీడియా గ్రూపులు మరియు ఛానళ్లను సృష్టించి, వాటిలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పరిశోధనలో బయటపడింది.

ఎన్‌ఐఏ దర్యాప్తులో, నిందితులు ఐసిస్ సిద్ధాంతాల ప్రభావంలో ఉన్నట్లు, కమ్యూనల్ హార్మనీ, జాతీయ ఏకత, భద్రతకు హానికరమైన కంటెంట్‌ను పంచుకున్నట్లు సాక్ష్యాలు గుర్తించారు. ఈ నిందితులపై భారతీయ న్యాయ శాస్త్రం (BNS), ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టెన్సెస్ యాక్ట్, మరియు యు.ఏ. (పీ) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ తీవ్రవాద కుట్రలో ఇంకా పాల్గొన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని ఎన్‌ఐఏ తెలిపింది.

Next Story