ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ఈడీ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి శుక్రవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

By -  Knakam Karthik
Published on : 23 Jan 2026 11:31 AM IST

Andrapradesh, AP liquor scam case, MP Midhun Reddy, Ysrcp,  ED

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ఈడీ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి శుక్రవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా ఇదే కేసులో విచారణకు రావాలని జనవరి 19న జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు 8 గంటల పాటు విజయసాయిని ఈడీ అధికారులు విచారించారు. విజయసాయి వాంగ్మూలం ఆధారంగా ఇవాళ మిథున్‌రెడ్డి ఈడీ విచారించే అవకాశం ఉంది. అయితే మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

Next Story