జగన్ నచ్చారు.. ఆయ‌న‌తో కలిసి పని చేస్తా: కేశినేని నాని

సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మాట్లాడారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. నిరుపేదల పక్షపాతి అని అన్నారు.

By Medi Samrat  Published on  10 Jan 2024 1:45 PM GMT
జగన్ నచ్చారు.. ఆయ‌న‌తో కలిసి పని చేస్తా: కేశినేని నాని

సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మాట్లాడారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. నిరుపేదల పక్షపాతి అని అన్నారు. రూ. 2 లక్షల కోట్లు పేదలకు పంచారని.. జగన్ నచ్చారని.. జగన్ తో నేను కలిసి పని చేస్తానన్నారు. ఎంపీ పదవి రాజీనామా చేస్తా.. దానికి ఆమోదం పొందగానే.. త్వరలో వైసీపీలో చేరతానన్నారు. తాజ్ మహల్ షాజహాన్ కట్టాడని.. చంద్రబాబు అమరావతి కట్టాలని అనుకున్నారు. విజయవాడను అభివృద్ధి చేయండి.. అమరావతి వద్దని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ కాబోతోందని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఏ హోదాలో చేస్తున్నారు.. ఓడిపోయిన లోకేష్‌కు నేనొచ్చి జీ హూజూర్ అనాలా.. అని కేశినేని నాని ప్రశ్నించారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు.

టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని.. చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు కేశినేని నాని. 2014కు ముందు టీడీపీలో చేరతానంటే చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని.. రాజకీయాల కోసం రూ. 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని తెలిపారు. ఎంపీగా ఉన్న కేశినేని నానిని చెప్పుతో కొడతానని.. మరో నేత తనను గొట్టం గాడు అన్నారని.. అయినా కూడా పార్టీ అధినేత స్పందించలేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని కేశినేని నాని తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని తన కుటుంబ సభ్యుడికి ఇవ్వాలని అనుకున్నారన్నారు. చంద్రబాబు మోసగాడని తెలుసు కానీ.. పచ్చి మోసగాడని అనుకోలేదన్నారు కేశినేని నాని.

Next Story