ఎన్టీఆర్‌ను చంపేసిన బాబును, మిమ్మల్ని పంచభూతాలు ఏమీ చేయవా బాలకృష్ణా?: మంత్రి రోజా

Minister Roja made sensational comments on Chandrababu and Balakrishna. మంత్రి రోజా మాట్లాడుతూ.. ''అమరావతి రైతుల పేరుతో చేస్తున్న యాత్ర... కేవలం చంద్రబాబు, తన బినామీల

By అంజి  Published on  26 Sep 2022 4:20 AM GMT
ఎన్టీఆర్‌ను చంపేసిన బాబును, మిమ్మల్ని పంచభూతాలు ఏమీ చేయవా బాలకృష్ణా?: మంత్రి రోజా

- మీరు ఎన్టీఆర్‌కు అన్నం పెడితే.. బాబు వెన్నుపోటు పొడిచేవాడా..?

- మీ తండ్రి చావుకు కారణమైన చంద్రబాబును మీ బ్లడ్, బ్రీడ్ ఏమీ చేయలేదా..?

- ఉత్తరాంధ్ర, రాయలసీమలో రైతులు లేరా, వారికి అభివృద్ధి వద్దా..?

- 29 గ్రామాల కోసం 26 జిల్లాలకు నష్టం చేస్తారా..?

29 గ్రామాల కోసం 26 జిల్లాలకు నష్టం చేస్తారా..?

మంత్రి రోజా మాట్లాడుతూ.. ''అమరావతి రైతుల పేరుతో చేస్తున్న యాత్ర... కేవలం చంద్రబాబు, తన బినామీల భూములను కాపాడుకోవడం కోసం, అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెంచుకోవడం కోసం, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేయిస్తున్న యాత్రే తప్పితే అది రైతుల కోసం చేస్తున్న యాత్ర కాదు. తన స్వార్థం కోసం, 29 గ్రామాల కోసం.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు నష్టం చేసే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు చేస్తున్నారు.''

''పాదయాత్ర పేరుతో కోర్టులో పర్మిషన్ తెచ్చుకుని, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే రైతుల ముసుగులో ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్నారు. ఒక్క అమరావతిలోనే రైతులు ఉన్నారా... ఉత్తరాంధ్రలో, రాయలసీమలో రైతులు లేరా.. వారు బాగుపడవద్దా..?. వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందకూడదా?'' అని మంత్రి రోజా ప్రశ్నించారు.

''గతంలో రాష్ట్ర సంపదనంతా హైదరాబాద్ లో పోసి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుని, రాష్ట్ర విభజనతో దాన్ని వదులుకుని వచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికే చాలా నష్టపోయాం. గతంలో చేసిన తప్పు రిపీట్ కాకూడదు. భవిష్యత్తులో ఇటువంటి నష్టం మనకు రాకూడదు. ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్.. పెద్ద మనసుతో నిర్ణయం తీసుకుంటే.. చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వంపైన బురదచల్లుతున్నారు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.'' అంటూ రోజా మండిపడ్డారు.

''నిజంగా చంద్రబాబుకు అమరావతి మీద ప్రేమే ఉంటే.. అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో ఎందుకు కట్టలేకపోయావు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ఎల్లో మీడియాలో గ్రాఫిక్స్ చూపించి, నాలుగు టెంపరరీ బిల్డింగ్ లు కట్టి.. వాటిల్లో కూడా దోచుకున్నారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ వాస్తవంగా అక్కడ లేవు కాబట్టే, ఆ ప్రాంతంలో మంగళగిరి, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. రెండు చోట్లా మిమ్మల్ని ప్రజలు ఓడించారు. అమరావతి ప్రాంతంలో రెండు సీట్లల్లో వైఎస్ఆర్ సీపీ గెలిచిందంటేనే దాని అర్థం ఏమిటి..?. అది కేవలం భ్రమరావతే గానీ అమరావతి కాదు అని ప్రజలు తీర్పు ఇచ్చినట్టే కదా..?. అక్కడ మీరు, మీ బినామీలు భూములు దోచుకున్నారనే కదా..?'' అంటూ ఎద్దేవా చేశారు.

విశ్వాసం లేనిది ఎవరికి?

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై.. చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాట్లాడటం సిగ్గు చేటు. నా సహచర నటుడు బాలకృష్ణ చేసిన ట్వీట్ మరింత బాధాకరం. విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయి అంటున్న బాలకృష్ణను సూటిగా ప్రశ్నిస్తున్నాను. విశ్వాసం లేనిది ఎవరికి మీకా, మాకా అని..?. పిల్లనిచ్చి పెళ్ళిచేసి, మంత్రి పదవి ఇచ్చి, రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. అంటువంటి ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన అతడికా విశ్వాసం లేనిది.. లేక, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా మీకు ఒక అడ్రస్ ఇచ్చి, ఆస్తులు ఇస్తే.. కనీసం తండ్రికి అన్నం పెట్టలేని మీకా విశ్వాసం లేనిది.? ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని లాక్కుని, ఆయన పార్టీ ట్రస్టు ఆస్తులను లాక్కుని, బతికుండగానే ఎన్టీఆర్ ను చంపేసిన చంద్రబాబును, ఆయన అక్రమాలకు అండగా నిలిచిన మిమ్మల్ని పంచ భూతాలు ఏమీ చేయవా బాలకృష్ణా..? అని మంత్రి రోజా ప్రశ్నించారు.

Next Story