సచివాలయ ఉద్యోగులకు సెలవులు రద్దు.. ప్రభుత్వం ఉత్తర్వులు

Leave cancelled for secretariat employees in AP. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవులను రద్దు చేసింది.

By అంజి  Published on  14 March 2022 3:41 AM GMT
సచివాలయ ఉద్యోగులకు సెలవులు రద్దు.. ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవులను రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌ వాడీ కార్మికులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీడీవో, డీఎల్‌పీవో, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు సెలవ మంజూరు చేయవద్దని ఆ యా శాఖల అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉద్యోగులు హాజరు పట్టికలో సంతకాలు చేసిన కాపీలను ఉదయం 10.45 గంటలకు పై అధికారులకు పంపించాలని ఆదేశించారు. హెడ్‌క్వార్టర్లు విడిచి పెట్టి వెళ్లొద్దని ఆదేశించారు. అలాగే సచివాలయాల పరిధిలో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహిస్తారు. బాధితులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి సోమవారం సచివాలయాని వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు సెలవులు మంజూరు చెయొద్దని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్లు హెచ్చరించారు. కాగా కలెక్టర్ల ఆదేశాలపై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Next Story