వివేకా హత్య కేసు.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది

By Medi Samrat
Published on : 26 April 2025 8:45 AM

వివేకా హత్య కేసు.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. రంగన్న మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. కేసులో సాక్షులుగా ఉండి మరణించిన వారందరి బంధువులను, సన్నిహితులను కూడా సిట్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో ఆరుగురు సాక్షులు మరణించారు. కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివేకా హత్య కేసులో మరో సాక్షిగా ఉన్న కసునూరు పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు.

Next Story