Andrapradesh: వివేకా హత్య కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 13 Jan 2026 5:20 PM IST

Andrapradesh, Y.S. Viveka, Murder Case, Supreme Court, Ys Sunitha, CBI

Andrapradesh: వివేకా హత్య కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తదుపరి దర్యాప్తు పరిధిని కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేస్తూ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలు చేశారు.

ట్రయల్ కోర్టు నిర్ణయం, తాము లేవనెత్తిన అంశాలకు, సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాల మేరకు విచారణ జరిపిన సీబీఐ కోర్టు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాలపై మాత్రమే దర్యాప్తును పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాక్షిక ఉత్తర్వులనే సునీతారెడ్డి తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.

Next Story