కాటసాని 'వెయ్యి కోట్ల' సవాల్..!

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రముఖ మీడియా సంస్థపై ఫైర్ అయ్యారు.

By Medi Samrat
Published on : 21 Feb 2024 7:45 PM IST

కాటసాని వెయ్యి కోట్ల సవాల్..!

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రముఖ మీడియా సంస్థపై ఫైర్ అయ్యారు. తన కుటుంబ సభ్యులపై కావాలనే ఆ పేపర్ లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మీడియా దిగ్గజం భార్య, కోడలిపై కూడా ఇలాగే తప్పుడు వార్తలు రాస్తే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. నాకు పది శాతం వాటాలు ఎవరు ఇచ్చారో ఈనాడు రామోజీ నిరూపించాలని అన్నారు. పత్రికా స్వేచ్చ అంటే ఇష్టం వచ్చినట్లు రాయటం కాదు.. రాసిన తప్పుడు వార్తలపై వివరణ అడగటానికి వెళ్తే ఆఫీసుకు తాళం వేసుకుని పారిపోయారన్నారు. దమ్ముంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. అంతేగానీ అనవసరంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయొద్దని కాటసాని వివరించారు. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాపై తప్పుడు వార్తలు రాయటం పత్రికా స్వేచ్ఛ కాదన్నారు.

మేము తప్పులు చేస్తే ఎత్తిచూపండి.. కానీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తామంటే అది కరెక్టు కాదన్నారు కాటసాని. రైతులకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. నేను తప్పులు చేశానని నిరూపిస్తే నా అస్తులన్నీ రాసిస్తానన్నారు. చంద్రబాబుకు ఈనాడు కరపత్రం. నాకు వెయ్యి కోట్ల ఆస్తి ఉన్నట్టు రామోజీ రాశాడు. ఆ పేపర్లు చూపిస్తే ఆ ఆస్తులన్నీ రామోజీకే రాసిస్తా. ఈనాడులో ఇష్టం వచ్చినట్లు రాసినందునే మా వాళ్లు వెళ్లారు. దాడి చేయాలని మావాళ్లు వెళ్లలేదు. కనీసం ఆఫీసులోకి కూడా మా వాళ్లు వెళ్ల లేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Next Story