నేడు విజ‌య‌వాడ‌కు జ‌న‌సేనాని

Janasena Chief Pawan Kalyan going to vijawada today.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ శ‌నివారం విజ‌య‌వాడ‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2021 7:47 AM GMT
నేడు విజ‌య‌వాడ‌కు జ‌న‌సేనాని

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ శ‌నివారం విజ‌య‌వాడ‌కు రానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల ప్రాంతంలో విమానంలో ప‌వ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకోన‌న్నారు. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు జనసేనాని. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు. ప్ర‌భుత్వ విధానాల‌పై పార్టీ నేత‌ల‌తో ప‌వ‌న్ చ‌ర్చించ‌నున్నారు.

Next Story