'తల్లికి వందనం' డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి

అర్హులైనా 'తల్లికి వందనం' పథకం డబ్బులు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.

By అంజి
Published on : 20 Jun 2025 8:06 AM IST

money, Thalliki Vandhanam scheme, APnews, APgovt

'తల్లికి వందనం' డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి

అమరావతి: అర్హులైనా 'తల్లికి వందనం' పథకం డబ్బులు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంకా ఫిర్యాదు చేయని వారు సాయంత్రంలోపు గ్రీవెన్స్‌ ఫామ్‌ ఫిల్‌ చేసి, తగిన ప్రూఫ్స్‌తో కలిపి మీ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. డబ్బు జమ కాని వారు వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.

ఫిర్యాదును పరిశీలించి.. నిజంగానే అర్హత ఉంటే మీ పేరును జాబితాలో చేరుస్తారు. సవరించిన జాబితా ప్రకారం.. వచ్చే నెల 5వ తేదీన ఈ డబ్బు జమ చేయనున్నారు. ఈ నెల 21 నుంచి 28 వరకు ఫిర్యాదులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. 30న జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వచ్చే నెల 5వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.

'సూపర్ సిక్స్' హామీలను నెరవేర్చడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లులకు ఏటా రూ.15,000 చొప్పున అందజేయబడుతుంది. ఈ సంవత్సరం 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పథకాన్ని పొందేందుకు అర్హులు.

అంతకుముందు ఎన్టీఆర్ భరోసా కింద మెరుగైన పెన్షన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం, మెగా డిఎస్‌సి నిర్వహణ, దీపం -2 కింద మూడు ఉచిత ఎల్‌పిజి కనెక్షన్లు రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేయబడిన ఇతర 'సూపర్ సిక్స్' హామీలు.

Next Story