తొందరపాటు చర్యలొద్దు..సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.

By Knakam Karthik
Published on : 27 Jun 2025 12:39 PM IST

Andrapradesh, Ap High Court, Former Cm Jagan, Singayya death case

తొందరపాటు చర్యలొద్దు..సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను జులై 1వ తేదీన చేపడతామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కాగా పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్‌ అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణను నేటి వాయిదా వేశారు. ఈ మేరకు ఇవాళ మరోసారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. ఇదే కేసులో జగన్‌తో పాటు కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. దీంతో వారు కూడా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Next Story