వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై నూజివీడు కోర్టులో విచారణ జరిగింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం గతంలో కస్టడీకి ఇవ్వడంతో తాజా పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో సరిగా విచారణ జరగలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలని నూజివీడు కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు.
వంశీని రెండో సారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది నూజివీడు కోర్టు. హనుమాన్ జంక్షన్ పోలీసులు ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించారని వంశీ తరపు న్యాయవాది వాదించారు.