ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : హోం మంత్రి అనిత

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

By Kalasani Durgapraveen  Published on  14 Oct 2024 2:15 PM GMT
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : హోం మంత్రి అనిత

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ విష‌య‌మై విశాఖపట్నంలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడడం జరిగిందన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నామ‌న్నారు. తుఫాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగా గుర్తించాం.. అక్కడికి బృందాలను పంపిస్తున్నాం అని తెలిపారు.

తుఫాను షెల్టర్‌లు సిద్ధం చేసామని.. చిత్తూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం జిల్లాల‌లోని ప్రాంతాలను ముందుగా అప్రమత్తం చేసిన‌ట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిద్ధం చేస్తున్నాం. గంటగంటకు ఎంత వర్షపాతం నమోదు అయిందో పర్యవేక్షిస్తున్నాం.. సెలవుల్లో ఉన్న అధికారులు కూడా విధుల్లోకి వస్తున్నారన్ని.. డ్రోన్స్ కూడా వినియోగిస్తున్నామని తెలిపారు.

Next Story