ఏపీలోని విద్యార్థులకు తీపికబురు..స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్స్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

By Knakam Karthik
Published on : 10 Jun 2025 12:36 PM IST

Andrapradesh, School Students, Vidyarthi Mitra KIT, AP Government

ఏపీలోని విద్యార్థులకు తీపికబురు..స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్స్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకునే రోజే విద్యార్థులకు ‘‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’’ కిట్లను అందించేందుకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విద్యార్థి మిత్ర కిట్లలో బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బెల్ట్, బూట్లు, 2 జతల సాక్సులు, డిక్షనరీ ఉంటాయి. ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్‌ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఈ నెల 12న పాఠశాల తిరిగి ప్రారంభం కాగానే... విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న తల్లిదండ్రుల, ఉపాధ్యాయ కమిటీ (పీటీఎం) మెగా సమావేశం నాటికి పిల్లలందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లను అందించేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లను అందజేయనున్నారు. అయితే ఈ ఒక్కో విద్యార్థి మిత్ర కిట్ మీద ప్రభుత్వం రూ.2,279 ఖర్చుచేస్తోంది. అయితే విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా అందిస్తున్న యూనిఫామ్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకనున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా కొత్త యూనిఫామ్‌ డిజైన్లు ఖరారు కూడా చేశారు. ఈసారి విద్యార్థులు ఈ కొత్త రంగులతో కూడిన యూనిఫామ్‌‌ను అందుకోనున్నారు.

Next Story