వారికి 5 రోజులే వర్కింగ్ అవర్స్..గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

By Knakam Karthik
Published on : 20 Jun 2025 1:59 PM IST

Andrapradesh, Ap Government, Secretariat employees

వారికి 5 రోజులే వర్కింగ్ అవర్స్..గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారానికి ఐదు రోజుల పని దినాల కాలపరిమితి ఈ నెల 26వ తేదీతో ముగుస్తుండటంతో దాన్ని మరి ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని గంటలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయ ఉద్యోగులతో పాటు రాజధాని అమరావతి పరిధిలోని హెచ్‌వోడీలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులకు ఈ జీవో వర్తిస్తుందని సీఎస్ విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story