రైతుల‌కు భారీ గుడ్‌న్యూస్‌.. రేపే అకౌంట్ల‌లో రూ. 7 వేలు జ‌మ‌

అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల జమకు రంగం సిద్దం అయ్యింది.

By -  Medi Samrat
Published on : 18 Nov 2025 6:20 AM IST

రైతుల‌కు భారీ గుడ్‌న్యూస్‌.. రేపే అకౌంట్ల‌లో రూ. 7 వేలు జ‌మ‌

అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల జమకు రంగం సిద్దం అయ్యింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఈ నెల 19వ తేదీన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నంది. ఈ మేర‌కు 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును జమ చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమ చేయనుంది. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు అందించనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు రైతులకు చెల్లింపులు జ‌రుపుతుంది. పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో నెలలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

ఈ మేర‌కు 19వ తేదీ కమలాపురంలో పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో సిఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పుట్టపర్తి పర్యటన అనంతరం మధ్యాహ్నం కమలాపురం వెళ్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గోవాలని సీఎం సూచించారు. 10 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో నిధుల విడుదల కార్యక్రమాన్ని లైవ్ టెలి కాస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. రైతుల ఖాతాల్లో నిధుల విడుదల మాత్రమే కాకుండా.. వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సిఎం సూచన చేశారు. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, పకృతి సేధ్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతాంగానికి అవగాహన కలిగించేలా కార్యక్రమ నిర్వహణ చేప‌ట్టాల‌ని దిశానిర్దేశం చేశారు.

Next Story