'నన్ను రెచ్చగొడితే వైఎస్ జగన్కే నష్టం'.. విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్
వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదన్నారు.
By అంజి
'నన్ను రెచ్చగొడితే వైఎస్ జగన్కే నష్టం'.. విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్
వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదన్నారు. అందుకే తనపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారని, తనను ఇరిటేట్ చేయటం వల్ల తాను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నానని పేర్కొన్నా. తన రియాక్షన్ వల్ల జగన్కు నష్టం కలగాలని నమ్ముతున్నవారే తనను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని, రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్కి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో..
''నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరి నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011 లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా భాద్యత తీసుకుని ఉందేవాదినేమో. కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా ?
అవును. నేను ఘట్టమనేని ఆది శేషగిరిరావుగారి ఇంటికి వెళ్ళా నాకు స్వర్గీయ కృష్ణ కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అదే సమయం లో టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ ని, చంద్రబాబుని కలుస్తాకానీ వేరేవాళ్ళతో ఎందుకు చర్చిస్తాను. వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేసు.
లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేసు ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు'' అని విజయసాయిరెడ్డి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.