మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై గతంలో దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి పలువురు వైసీపీ నేతల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా పలువురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని ఆళ్లకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆళ్ల పిటిషన్పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రూ. 25 వేల పూచీకత్తుతో ఆళ్లకు బెయిల్ మంజూరు చేసింది.