వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో గోపీని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే గోపీపై కేసు నమోదు అయింది. ఇదే కేసులో విడదల రజిని కూడా నిందితురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.