ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2025-26 సంవత్సరంలో తొలి విడతగా మంజూరు చేసిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందుకోసం రూ.176.35 కోట్లు విడుదల చేసింది. నిబంధనల మేరకు నిధులు వినియోగానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.1,136 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్, పరిపాలన సంబంధిత వ్యయాలు కలుపుకొని ఉన్నాయి. ఈ మొత్తాన్ని తక్షణమే బకాయి బిల్లులకు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. గ్రామీణ ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు తెలిపారు.