ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు నెరవేరుతాయి..అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు నెరవేరుతాయి..అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీసీసీ చీఫ్గా బహింగంగా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాల మీద గౌరవం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్లు, భవిష్యత్లో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్లు ముందుకు రావాలి. అన్ని రిసోర్స్ కలిగిన వాళ్ళు ముందుకు రావాలి. అటువంటి వాళ్ళకు ప్లాట్ఫామ్ కల్పించేందుకు రెడీగా ఉన్నాం. కాంగ్రెస్లో కార్యకర్తలు కమిట్ మెంట్ తో కూడిన వాళ్ళు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాను నెత్తిన మీద పెట్టుకొని మోసిన వాళ్ళు. ప్రతి జిల్లాల్లో వాళ్ల తపన చూస్తే ఎంతో అభిమానం కలిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. గ్రౌండ్ లెవల్లో మంచి నాయకత్వం ఉంటే ఆదరించే ప్రజలు కోట్లలో ఉన్నారు. కోట్ల మంది ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను గౌరవించే వాళ్ళు, ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని వెళ్ళే వాళ్ళు,YSR ఆశయాలను నిలబెట్టే వాళ్లను కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది. చేరికలకు నేను పూచి. నాకు కాంగ్రెస్ అభివృద్ధి ఒక్కటే అజెండా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలి.. దేశంలో రాహుల్ ప్రధాని అవ్వాలి..అని షర్మిల పేర్కొన్నారు.
ఆంధ్రా రాష్ట్ర విభజన కాంగ్రెస్ తప్పు కాదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర విభజన చేయలేదు. అందరు ఒప్పుకుంటేనే రాష్ట్రం విభజన జరిగింది. చిన్నమ్మ అని చెప్పి బీజేపీ రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చింది. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాలేదు. ఇది చాలా సాడ్ పార్ట్. అప్పుడే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే విభజన హామీలు నెరవేరి ఉండేవి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. రాజధాని నిర్మాణం అయ్యేది..అని షర్మిల వ్యాఖ్యానించారు.