తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టీటీడీ నిర్ణయం హర్షణీయం

తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

By Kalasani Durgapraveen
Published on : 19 Nov 2024 10:00 AM IST

తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టీటీడీ నిర్ణయం హర్షణీయం

తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తిరుప‌తి నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చానని తెలిపారు.

నగర ప్రజల ఆకాంక్షను టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించానని.. టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు ఛైర్మన్ బి.ఆర్.నాయుడుకి, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్యామలరావుకి అభినందనలు లెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు అని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Next Story