అలా మాట్లాడాలనుకుంటే పాక్కే వెళ్లిపోండి..డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్
జమ్ముకాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారికి జనసేన సంతాపం తెలిపింది.
By Knakam Karthik
అలా మాట్లాడాలనుకుంటే పాక్కే వెళ్లిపోండి..డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్
జమ్ముకాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారికి జనసేన సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్రఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని అన్నారు.
సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్రావు ఎవరికి హాని చేశారు?. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్కు వెళ్తే చంపేశారు. కశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి?. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని, మత ప్రాతిపదికన చంపడం సరికాదని..పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
The national slogan of India is "Satyameva Jayate", unlike America's "In God, we trust". we are beyond religion, we are beyond God..!#JSPCondemnTerror #PahalgamTerroristAttack pic.twitter.com/th7JnMJ4yG
— JanaSena Party (@JanaSenaParty) April 29, 2025