విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుపై ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. విశాఖలోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
కాగా నూతన క్యాంపస్లో సుమారు 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కాగ్నిజెంట్ పేర్కొంది. AI, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.