రేపు మార్కాపురంలో పర్యటించనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 April 2023 12:15 PM GMT
CM YS Jagan, Markapuram, APnews, YSR EBC Nestham

రేపు మార్కాపురంలో పర్యటించనున్న సీఎం జగన్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. 10.15- 12.05 గంటలకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. గత ఏడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అర్హులైన వారికి నగదు జమ చేయనున్నారు.

Next Story