Vizag: కాలి బూడిదైన పడవలు.. నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన పడవలకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

By అంజి
Published on : 21 Nov 2023 6:45 AM IST

CM YS Jagan, boats gutted, Vizag fishing harbour, APnews

Vizag: కాలి బూడిదైన పడవలు.. నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన పడవలకు 80 శాతం నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో 36 పడవలు పూర్తిగా ధ్వంసమైనట్లు, తొమ్మిది పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. బాధితులు నష్టాన్ని తట్టుకుని తిరిగి జీవనోపాధి పొందేలా మానవత్వం ప్రదర్శించి పరిహారం చెల్లించాలని అధికారులకు సీఎం సూచించారు. సుమారు రూ.12 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక అంచనా ప్రకారం తుది నివేదికను సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో కలిసి మత్స్యశాఖ మంత్రి ఎస్‌.అప్పలరాజు ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి చేరుకోవాలని మంత్రి, జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. ఆదివారం అర్థరాత్రి ఓ బోటులో చెలరేగిన మంటలు చుట్టుపక్కల బోట్లకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు నాలుగు గంటల సమయం పట్టింది.

Next Story