ఎల్లుండి సీఎం జగన్‌ కాకినాడ జిల్లా ప‌ర్య‌ట‌న‌

ఎల్లుండి(12వ తేదీ) సీఎం జగన్‌ కాకినాడ జిల్లా సామర్లకోట పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  10 Oct 2023 1:30 PM GMT
ఎల్లుండి సీఎం జగన్‌ కాకినాడ జిల్లా ప‌ర్య‌ట‌న‌

ఎల్లుండి(12వ తేదీ) సీఎం జగన్‌ కాకినాడ జిల్లా సామర్లకోట పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు. అనంతరం జ‌రుగ‌నున్న‌ బహిరంగ సభలో ప్ర‌సంగిస్తారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు పర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సామర్లకోట చేరుకుంటారు. అక్కడ జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం, అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story