ఎంజీఆర్‌ సంగం బ్యారేజీని ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan inaugurated MGR Sangam Barrage and Nellore Barrage. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం

By అంజి  Published on  6 Sep 2022 10:16 AM GMT
ఎంజీఆర్‌ సంగం బ్యారేజీని ప్రారంభించిన సీఎం జగన్

మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సంగం-పొదలకూరు, నెల్లూరు-కోవూరు మధ్య సాఫీగా రవాణా చేసేందుకు నూతనంగా నిర్మించిన పెన్నా బ్యారేజీ-కమ్-రోడ్డు వంతెనను కూడా ఆయన ప్రారంభించారు. సంగం బ్యారేజీలో నిల్వ ఉన్న నీటితో 3.85 లక్షల ఎకరాలకు, నెల్లూరు బ్యారేజీ ద్వారా 99,525 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. జలయజ్ఞంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి (వైఎస్‌ఆర్) 2006లో సంగం బ్యారేజీ ఆధునికీకరణకు పునాది వేశారు.

16 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ కుమారుడు, సీఎం జగన్ రెడ్డి రెండు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు. అంతకుముందు వైఎస్‌ఆర్‌, మాజీ మంత్రి దివంగత మేకపాటి గౌతురెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. ఎంజీఆర్‌ సంగం, నెల్లూరు బ్యారేజీల ద్వారా ఆత్మకూర్‌, కోవూరు, సర్వేపల్లి, కావలి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీల పూర్తికి వైసీపీ ప్రభుత్వం రూ.320 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వివరించారు.

ఇక నెల్లూరు జిల్లాలో కరవు మండలమే ఉండదని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేశామని సీఎం జగన్‌ వెల్లడించారు. గౌతమ్ రెడ్డి జ్ఞాపకాలతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు. మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.



Next Story