AndhraPradesh: నేడే కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ

కొత్తగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు.

By -  అంజి
Published on : 16 Dec 2025 7:09 AM IST

CM Chandrababu, appointment documents, new constable jobs, APnews

AndhraPradesh: నేడే కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ

అమరావతి: కొత్తగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి ఏపీఎస్‌పీ ఆరో బెటాలియన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అభ్యర్థులతో సమావేశమై కాసేపు ముచ్చటించనున్నారు. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు వారికి ట్రైనింగ్‌ ఉంటుంది.

2022 నవంబర్‌లో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అన్ని టెస్టులను దాటుకుని 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపికయ్యారు. 22వ తేదీ లోపు వారికి కేటాయించిన విభాగాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్కడ 9 నెలల పాటు కానిస్టేబుళ్లకు శిక్షణ ఉంటుంది. 2022 నవంబర్‌లో నోటిఫికేషన్‌ రాగా అనేక అడ్డంకులను దాటుకుని ఈ ఏడాది ఆగస్టులో తుది ఫలితాలు వెల్లడయ్యాయి.

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని సులభతరం చేయడానికి మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 16న కొత్తగా ఎంపికైన దాదాపు 6,000 మంది పోలీసు కానిస్టేబుళ్లకు నాయుడు స్వయంగా నియామక పత్రాలను అందజేయనున్నారు. గతంలో, వివిధ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత, సీనియర్ అధికారులు కొత్తగా ఎంపికైన పోలీసులకు నియామక లేఖలు అందజేసేవారు. ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాలనుకుంటున్నారు.

Next Story