మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరో నిందితుడు వెంకటేశ్ నాయుడుని మూడు రోజుల పాటు విచారించేందుకు పోలీసులకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది.
జులై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. 39వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.