సీఎం జగన్‌ను కలిసిన పెప్పర్‌ మోషన్‌ సీఈవో

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్ధ పెప్పర్‌ మోషన్‌ సీఈవో

By Medi Samrat  Published on  29 Nov 2023 1:20 PM GMT
సీఎం జగన్‌ను కలిసిన పెప్పర్‌ మోషన్‌ సీఈవో

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్ధ పెప్పర్‌ మోషన్‌ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్, ప్రతినిధి బృందం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిసింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్‌ను పెప్పర్‌ మోషన్ ఏర్పాటుచేయనుంది. దీనికి అతి త్వరలో భూమిపూజకు సిద్దమవుతుంది కంపెనీ. గ్రీన్‌ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్‌ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్‌ మోషన్‌ ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు.

ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్ధ్యం, ఇంటిగ్రేటెడ్‌ వర్టికల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ పెప్పర్‌ మోషన్ ఏర్పాటుచేయనుంది. 20 జీడబ్ల్యూహెచ్‌ సామర్ధ్యం గల బ్యాటరీల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్‌ ఏర్పాటు, డీజిల్‌ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్‌ సామర్ధ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్‌ ఏర్పాటుచేయనున్నట్లు పెప్పర్‌ మోషన్‌ సీఈవో.. సీఎంకి తెలిపారు.

ఏపీలో ఏర్పాటుచేస్తున్న యూనిట్‌కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం, ప్రభుత్వ సహకారంపై పెప్పర్‌ మోషన్‌ సీఈవో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ఏర్పాటుచేస్తున్న గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా ఏషియా, మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్‌ భాగస్వామ్యులకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ల‌భించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Next Story