విశాఖపట్నం - వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన రైల్వే బోర్డు

విశాఖపట్నం: గంగా పుష్కరాల సందర్భంగా, వేసవి కాలంలో విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు

By అంజి  Published on  13 April 2023 4:45 AM GMT
Central Railway ,  special trains, Visakhapatnam, Varanasi

విశాఖపట్నం - వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన రైల్వే బోర్డు

విశాఖపట్నం: గంగా పుష్కరాల సందర్భంగా, వేసవి కాలంలో విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు బుధవారం ప్రకటించింది. ఎంపి జివిఎల్ నరసింహారావు ప్రత్యేక కృషి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోక్యంతో గంగా పుష్కరాల సందర్భంగా, వేసవి కాలంలో విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటన చేసింది.

''శ్రీ కాశీ తెలుగు సమితి గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారని, ప్రధానమంత్రి కార్యాలయం, వారణాసి జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం, సౌకర్యాలు కల్పించడం ఇక్కడ గమనించదగ్గ విషయం'' అని పేర్కొంది.

విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను రైల్వే బోర్డు ప్రకటించింది. ''గంగా పుష్కరాల కోసం విశాఖపట్నం నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 న బయలుదేరుతాయి. రైళ్లు వరుసగా ఏప్రిల్ 20, ఏప్రిల్ 27 న తిరిగి వస్తాయి. వేసవి కాలంలో రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుండి వారణాసికి రైళ్లు, రిటర్న్ ప్రత్యేక రైళ్లు కూడా మేలో 5 రోజులు, జూన్‌లో నాలుగు రోజులు నడుస్తాయి. ఈ విధంగా విశాఖపట్నం నుండి వారణాసికి 11 జతల ప్రత్యేక రైళ్లు నడపబడి తిరిగి వస్తాయి'' అని అధికారిక ప్రకటన తెలిపింది.

''వాల్తేరు డివిజన్ కొన్ని రోజుల క్రితం వేసవి కోసం ప్రత్యేక రైళ్లను ప్రతిపాదించింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోక్యంతో వెంటనే ఈ ప్రత్యేక రైళ్లు మంజూరు చేయబడ్డాయి. విశాఖపట్నం నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లు కావాలని ఆయన పట్టుదలతో వెంటనే ప్రకటించారు'' అని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు సకాలంలో జోక్యం చేసుకుని ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లను మంజూరు చేయించారని పేర్కొంది.

గంగా పుష్కరాలు, వేసవి సెలవులకు వెళ్లే యాత్రికుల కోసం విశాఖపట్నం నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లను సకాలంలో మంజూరు చేయడంలో తన జోక్యం, కృషి దోహదపడ్డాయని సంతృప్తి వ్యక్తం చేస్తూ, విశాఖపట్నంలోని ప్రజలు, వ్యాపారాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. "పెద్ద సంఖ్యలో యాత్రికులు వారణాసికి సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా విజయవాడ మరియు తిరుపతి నుండి వారణాసికి మరిన్ని ప్రత్యేక రైళ్లను మంజూరు చేసే ప్రయత్నాలను తాను కొనసాగిస్తున్నట్లు'' ఎంపీ జీవీఎల్ తెలిపారు.

Next Story