వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు, అరెస్టుల గురించి బైరెడ్డి మాట్లాడుతున్నారని, అక్క అని కూడా చూడకుండా తనపై కేసులు పెట్టించారని ఆరోపించారు. జగన్ తల్లిని, చెల్లిని ఎలా చేశారో ఇక్కడ కూడా అదే చేస్తున్నారని అన్నారు.
బైరెడ్డి అంటే తానేనని సిద్ధార్థ రెడ్డి కాదని ఎంపీ శబరి అన్నారు. సిద్ధార్థ రెడ్డికి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రావడం లేదని అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని, సినిమాల్లో ట్రై చేస్తే బెటర్ అని చెప్పారు. ఆడుదాం ఆంధ్రలో అవినీతి బయటకు వస్తుందని, అవినీతి చేసినవారికి శిక్ష తప్పదని అన్నారు. తొమ్మిది నెలల నుంచి సిద్ధార్థ రెడ్డి ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. సిద్ధార్థ రెడ్డికి ఫుల్ బాటిల్ వేయడం అలవాటు అయినట్టుందని విమర్శించారు.