బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. సుజనా చౌదరీకి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. 2023 – 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మెడిసిటీ మెడికల్ కాలేజ్లో 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశించింది.
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్పూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరీ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గుర్తించిందని తెలుస్తోంది.