ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రూ.99 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్కు రూ.10 చొప్పున ధర పెంచారు. ఇందులో IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి.
మద్యం విక్రయాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్ను కూడా ప్రభుత్వం స్వల్పంగా పెంచింది.. IMFL, FLతో పాటు రూ.99 ఎంఆర్పీ ఉన్న బీర్, వైన్ బాటిళ్లపై రిటైలర్ మార్జిన్ను 1 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మార్పులతో రిటైలర్లకు కొంత ఊరట లభించనుంది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.