ఆంధ్రప్రదేశ్ పట్టణపేదరిక నిర్మూలన సంస్ధ(మెప్మా)కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు లభించాయి. పట్టణాల్లో పేదరిక నివారణకు కృషి చేసినందుకు ఇవి దక్కాయి. సెప్టెంబర్ 20న దిల్లీలో స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన 14 ప్రాజెక్ట్ లకు గాను 9 ప్రాజెక్ట్లు ప్లాటినం అవార్డులు దక్కించుకున్నాయి. ఈ కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ వీటిని అందుకోనున్నారు.
నివాసం,బ్యాంక్ లింకేజి పథకాలు,లైవ్ లీ హుడ్ ట్రాకర్,ఈ -కామర్స్ అమ్మకాలు, స్కిల్ డెవలప్ మెంట్, జీవనోపాధి యూనిట్లు, ప్రేరణ సఖి, వీధి వ్యాపారుల మేనేజ్ మెంట్ ప్రోగ్రాం, దుర్బర జీవితాన్ని గడిపేవారిని ఆర్ధికంగా పైకి తీసుకువచ్చే పథకాలకు సంబంధించి ఈ అవార్డులు వరించాయి.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007 జులైలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఏర్పాటైంది. నగరపాలిక, పురపాలికలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళలతో సంఘాలను ఏర్పాటు చేసి వారికి పొదుపుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ పథకాల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ ఆర్ధికాభివృద్దికి మెప్మా చర్యలు తీసుకుంటుంది.