ఉక్రెయిన్ నుంచి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు.. చేరుకున్న ఏపీ విద్యార్థులు

AP students arrive from Ukraine at Rajahmahendravaram airport. ఉక్రెయిన్‌ దేశంలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు చల్లా సుదర్శన్, రాజనాల సుష్మ ఎట్టకేలకు ఆదివారం రాజమహేంద్రవరం

By అంజి  Published on  27 Feb 2022 10:39 AM GMT
ఉక్రెయిన్ నుంచి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు.. చేరుకున్న ఏపీ విద్యార్థులు

ఉక్రెయిన్‌ దేశంలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు చల్లా సుదర్శన్, రాజనాల సుష్మ ఎట్టకేలకు ఆదివారం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్జేవై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులను చూసి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గొల్లప్రోలు గ్రామానికి చెందినవారు. సుదర్శన్, సుష్మ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. సుదర్శన్ మాట్లాడుతూ.. తమ విశ్వవిద్యాలయం రుమానియాకు అనుకూలంగా ఉన్నందున, సులభంగా భారతదేశానికి రావచ్చని అన్నారు.

పశ్చిమ ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రభావం చాలా తక్కువగా ఉందని, అయితే తూర్పు ఉక్రెయిన్‌లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అన్నారు. యుద్ధం ప్రకటించిన వెంటనే భయాందోళనలకు గురయ్యారని చెప్పారు. నిరంతర భారీ బాంబు పేలుళ్ల కారణంగా తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని సుష్మా తెలిపారు. యుద్ధం ప్రకటించిన వెంటనే వారు ఆశ్రయం పొందేందుకు కష్టపడ్డారు. అవకాశం దొరికిన వెంటనే బయలుదేరాలని విశ్వవిద్యాలయ అధికారులు వారికి సలహా ఇస్తున్నారు. పరిస్థితులు మరింత దిగజారడం, క్షీణించడంతో వారు మెట్రో స్టేషన్లు, బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇంకా చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మిగిలి ఉన్నారు. భారతదేశానికి చేరుకున్న ఈ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story