'తల్లికి వందనం'పథకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
'తల్లికి వందనం' పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik
'తల్లికి వందనం'పథకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. పథకానికి సంబంధించి అర్హులు, అనర్హుల జాబితా సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రచురించామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులకు సంబంధించిన నగదును ఇప్పటికే వారి తల్లులకు విడుదల చేయడం జరిగింది. అనర్హత పొందిన లబ్దిదారుల వివరాలు గ్రామ సచివాలయ శాఖ వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే తెలియజేశాం. దరఖాస్తుదారుల ఫిర్యాదులను పరిశీలించి, వారు వాస్తవంగా అర్హత కలిగి ఉన్నట్లయితే వారికి కూడా లబ్థి చేకూర్చడం జరుగుతుంది..అని ప్రకటించింది.
ఇకతల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించి ‘తల్లికి వందనం’ నగదును సంబంధిత జిల్లా కలెక్టర్ అకౌంటుకు జమచేస్తున్నాం. క్షేత్ర స్థాయి పరిశీలన చేశాక వారికి కూడా కలెక్టర్ ద్వారా ‘తల్లికి వందనం’ నగదు అందజేయడం జరుగుతుంది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు కలిగిన తల్లుల జాబితా పున:పరిశీలించాక వారికి కూడా ‘తల్లికి వందనం’ నగదు జమ చేయడం జరుగుతుంది. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది