ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్ణతా శాతం 95.86%గా నమోదైంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ICET/ ద్వారా తెలుసుకోవచ్చు.
మే 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 93 కేంద్రాల్లో, హైదరాబాద్లోని ఒక కేంద్రంతో కలిపి మొత్తం 94 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 37,572 మంది దరఖాస్తు చేసుకోగా, 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది అర్హత సాధించారు.