విద్యార్థులకు దసరా సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP govt. announces Dussehra Holidays to schools from September 26. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు

By Medi Samrat  Published on  13 Sep 2022 3:45 PM GMT
విద్యార్థులకు దసరా సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. మరోవైపు క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 220 దినాలు పాఠ‌శాల‌లు న‌డుస్తాయి. 80 రోజులు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

తెలంగాణ‌లో కూడా పాఠ‌శాల‌లకు ఈ నెల 26 నుంచి వ‌చ్చే నెల 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 25, అక్టోబ‌ర్ 9న ఆదివారాలు కావ‌డంతో మొత్తం 15 రోజుల పాటు సెల‌వులు కొన‌సాగ‌నున్నాయి. అక్టోబ‌ర్ 10న తిరిగి పాఠ‌శాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు అన్ని జిల్లాల విద్యాధికారుల‌కు స‌ర్య్కూల‌ర్‌ను పంపించింది. కాగా.. అక్టోబ‌ర్ 5న ద‌స‌రా పండుగ జ‌ర‌గ‌నుంది.





Next Story